నేడు వరంగల్ బల్దియాలో గ్రీవెన్స్
WGL: నగరంలోని బల్దియా ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ సెల్ నిర్వహిస్తున్నట్లు అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్ తెలిపారు. ఉ.11 గంటల నుంచి అధికారులు రాతపూర్వకంగా దరఖాస్తులు స్వీకరింస్తారని అన్నారు. సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ సెల్ చక్కటి కార్యక్రమమని, ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని అడిషనల్ కమిషనర్ కోరారు.