గృహాల కోసం అర్హుల జాబితా సిద్ధం చేయాలి: కలెక్టర్
GNTR: దివ్యాంగులకు గృహాలు మంజూరు చేసేందుకు అర్హుల జాబితాను తక్షణం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. కలెక్టరెట్లో మంగళవారం ఆమె మాట్లాడుతూ.. దరఖాస్తుదారుల ఆధార్ చిరునామా, జాబ్ కార్డు వంటి వివరాలను పూర్తిగా పరిశీలించి జాబితాను ఖరారు చేయాలని అధికారులకు సూచించారు.