ఆధార్ క్యాంపును సందర్శించిన ఎంపీడీఓ

NLR: విడవలూరు మండలంలోని గాదేలదిన్నె గ్రామ సచివాలయంలో బుధవారం ప్రత్యేక ఆధార్ క్యాంప్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ నగేష్ కుమారి ఆధార్ క్యాంపును సందర్శించారు. అనంతరం సచివాలయం సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆధార్ క్యాంపుల్లో నూతన ఆధార్ కార్డులు నమోదు చేయుట, ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ, ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్ చేయడం, తదితర సేవలు అందుబాటులో ఉంటాయన్నారు.