డ్రిప్ ఇరిగేషన్ ఆటోమేషన్ పథకం పోస్టర్లు ఆవిష్కరణ
సత్యసాయి: ఏపీఎంఐపీ డ్రిప్ ఇరిగేషన్ ఆటోమేషన్ పథకం పోస్టర్లను కలెక్టర్ ఎ. శ్యాంప్రసాద్ విడుదల చేశారు. మొబైల్ యాప్ ద్వారా నీటి సరఫరాను నియంత్రించే ఈ సాంకేతికతతో విద్యుత్, ఎరువులు ఆదా అవుతాయని తెలిపారు. చిన్న రైతులకు 55%, పెద్ద రైతులకు 45% సబ్సిడీ అందుతుందని పేర్కొన్నారు. జిల్లాలోని 416 రైతు సేవా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.