VIDEO: వరినాట్లు వేసిన విద్యార్థులు

NRML: భైంసా మండలం వానల్పాడ్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. విద్యార్థులను రైతులు సాగు చేస్తున్న పొలాల వద్దకు తీసుకెళ్లి వరినాట్లు వేయించారు. విద్యార్థులను క్షేత్రస్థాయిలోకి వ్యవసాయ పనుల్లో భాగస్వామ్యులను చేయడం ద్వారా సాగుపై ఆసక్తి పెరుగుతుందన్నారు. విద్యార్థులు రైతులు పండించే పంటల గురించి అడిగి తెలుసుకున్నారు.