రాజేంద్రనగర్ డిపోలో నేడు డయల్ యువర్ డీఎం
RR: రాజేంద్రనగర్ ఆర్టీసీ డిపోలో నేడు డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ కృష్ణారెడ్డి తెలిపారు. రాజేంద్రనగర్ ప్రాంత ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు సలహాలను సూచించేందుకు ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు 9959226135 నెంబర్ కు ఫోన్ చేసి తెలపాలన్నారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.