చిరస్మరణీయుడు పొట్టి శ్రీరాములు: రామయ్య

KDP: ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి అసువులు బాసిన పొట్టి శ్రీరాములు చిరస్మరణీయుడని జనసేన రాష్ట్ర చేనేత వికార కార్యదర్శి రాటాల రామయ్య కొనియాడారు. సిద్దవటం మండలంలోని ఉప్పరపల్లిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం పొట్టి శ్రీరాములు 124వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు చిత్రపటానికి నివాళులర్పించారు.