వచ్చే నెల 13న జాతీయ లోక్ అదాలత్

ELR: తణుకు నాలుగో అదనపు జిల్లా జడ్జి డి.సత్యవతి కోర్టు ప్రాంగణంలో మంగళవారం కోర్టు కానిస్టేబుళ్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. వచ్చే నెల 13న జరిగే జాతీయ లోక్అదాలత్లో కేసుల రాజీ చేయడానికి సహకరించాలని కోరారు. రాజీపడు క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, మోటార్ వాహనాల ప్రమాద కేసులు రాజీ చేసుకోవచ్చని తెలిపారు.