కలెక్టరేట్లో వైభవంగా జయహో అమరావతి
ASR: రాష్ట్రానికి శాశ్వత రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ రాజధాని బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించిన నేపథ్యంలో పాడేరులో సంబరాలు అంబరాన్నంటాయి. గురువారం రాత్రి కలెక్టరేట్లో జయహో అమరావతి కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. అధికారులు అందరి మధ్య కలెక్టర్ దినేష్ కుమార్ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. రాజధాని బిల్లు ఆమోదం పొందడం అభివృద్ధికి సూచిక అన్నారు.