ఇరాన్కు సాయం చేసేందుకు ముందుకొచ్చిన చైనా
ఇరాన్ స్కూల్పై దాడి ఘటనలో బాధితులకు సాయం చేసేందుకు చైనా ముందుకొచ్చింది. మృతిచెందిన చిన్నారుల తల్లిదండ్రులకు రూ.1.7 కోట్ల సాయం అందించనున్నట్లు చైనా వెల్లడించింది. ఈ మొత్తాన్ని ఇరాన్ రెడ్ క్రెసెంట్ సొసైటీకి అందించనుంది. కాగా, ఇటీవల ఇరాన్ స్కూల్పై తోమహాక్ క్షిపణి దాడి చేసిన విషయం తెలిసిందే. స్కూల్పై క్షిపణి దాడిలో 150 మందికిపైగా పిల్లలు మృతిచెందారు.