జూద శిబిరంపై దాడి.. పేకాట రాయుళ్లు అరెస్ట్

జూద శిబిరంపై దాడి.. పేకాట రాయుళ్లు అరెస్ట్

కృష్ణా: నాగాయలంక మండలం ఏటిమోగ గ్రామంలో రహస్యంగా పేకాట ఆడుతున్నారనే సమాచారంతో పోలీస్ సిబ్బందితో కలిసి పేకాట శిబిరంపై దాడి చేశారు. పేకాట ఆడుతున్న 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 2,460 నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.