నేడు లండన్కు చంద్రబాబు దంపతులు
AP: పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా CM చంద్రబాబు దంపతులు ఇవాళ రాత్రి లండన్కు బయలుదేరనున్నారు. HYDలోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లనున్న ఆయన లండన్లో రోడ్ షో పాల్గొంటారు. అలాగే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. పెట్టుబడులకు కల్పిస్తున్న అనువైన వాతావరణం, ప్రోత్సాహం తదితరాలను ఆయన వివరించనున్నారు.