పెట్రోల్ బంకు సిబ్బందితో వాహనదారుల వాగ్వాదం
TG: రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంకులకు వాహనదారులు భారీ క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్లో పెట్రోల్ బంకు సిబ్బందితో వాహనదారులు వాగ్వాదానికి దిగారు. భారీ క్యూ లైన్లో నిలబడి తీర పెట్రోల్ కొట్టించుకునే టైం వచ్చేసారి సిబ్బంది ఒక్కో బైక్లో రూ.50 మాత్రమే కొడుతామని చెప్పారు. దీంతో సహనం కోల్పోయిన వాహనదారులు సిబ్బందితో గొడవకు దిగారు.