అప్పన్న అన్నదాన పథకానికి రూ.4 లక్షల విరాళం
VSP: సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి శాశ్వత అన్నప్రసాద పథకానికి విశాఖలోని సాలిగ్రామపురం గ్రామానికి చెందిన చెనుతల శంకరరావు, చెనుతల అమృత పల్లవి, చెనుతల తన్వి, తెన్నేటి దామోదర్ కలిసి మొత్తం రూ.4 లక్షలు విరాళంగా బుధవారం అందించారు. వారు ఒక్కొక్కరు రూ.లక్ష చొప్పున ఈ మొత్తాన్ని అన్నప్రసాద విభాగం సూపరిండెంట్ పాలూరి నరసింగరావుకు అందజేశారు.