శ్రమ దోపిడీపై సమరశీల పోరాటాలకు సిద్ధం కండి: AITUC
SRPT: శ్రమకు తగ్గ ఫలితం దక్కడం లేదని, కార్మికుల హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని ఏఐటీయూసీ (AITUC) రాష్ట్ర కార్యదర్శి మేకల శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. మఠంపల్లి మండల కేంద్రంలోని ఉర్దూ మీడియం స్కూల్ ఆవరణలో జరిగిన ఏఐటీయూసీ మండల మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.