'క్షయ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి'

VKB: క్షయ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని దౌల్తాబాద్ PHC వైద్యురాలు అమూల్య ప్రియదర్శిని అన్నారు. వ్యాధిగ్రస్థులకు ప్రభుత్వ ఆస్పత్రులలో మెరుగైన వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. గోకాఫసల్వాద్లోని ఆరోగ్య ఉప కేంద్రంలో టీబీ ముక్త భారత్ అభియాన్లో భాగంగా వైద్య శిబిరంను బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.