ఢిల్లీ దాడి ఘటన.. క్లాక్ టవర్ వద్ద బీజేపీ నిరసన
NLG: ఢిల్లీలో జరిగిన బాంబుదాడిని నిరసిస్తూ బీజేపీ శ్రేణులు నల్గొండలో ఆగ్రహం వ్యక్తం చేశాయి. గడియారం సెంటర్లో నిన్న రాత్రి బీజేపీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఢిల్లీ దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనకు పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు.