ఆటో డ్రైవర్లకు ప్రమాద బీమా చేయించిన నాయకుడు
BHNG: ఆత్మకూరు(M)మండల కేంద్రంలోని 32మంది ఆటో డ్రైవర్లకు ఒక్కొక్కరికి రూ.550తో మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్,BRS జిల్లా నాయకుడు గడ్డం దశరథ గౌడ్ రూ.10 లక్షల పోస్టల్ ప్రమాద బీమా చేయించారు. ఇవాళ బీమా పత్రాలను, బ్యాంక్ అకౌంట్ కార్డులను వారికి అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉచిత బస్ ప్రయాణంతో ఆటో డ్రైవర్ల కుటుంబాలు బజారులో పడ్డాయన్నారు.