'ఆన్ లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండండి'
VZM: ఆన్లైన్ మోసాలు పట్ల అప్రమత్తంగా ఉండాలని బొబ్బిలి రూరల్ CI ఎస్.శ్రీనివాస్ సూచించారు. బుధవారం సాయంత్రం గొల్లాదిలో స్దానికులతో సమావేశం నిర్వహించిన ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజంలో సైబర్ నేరాలు పెరిగాయని వీటిపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆధార్, బ్యాంకు, ATM, OTP లు గుర్తు తెలియని వ్యక్తులకు చెప్పవద్దని కోరారు.