ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: MLA
ADB: ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ MLA పాయల్ శంకర్ అన్నారు. సోమవారం జైనథ్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, గ్రామస్తులు తదితరులున్నారు.