ఉపాధి పనులను పరిశీలించిన ఎంపీడీవో
NZB: ధర్పల్లి మండలం దుబ్బాకలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను గురువారం ఎంపీడీవో లక్ష్మారెడ్డి పరిశీలించారు. కూలీల హాజరు వివరాలను ఫీల్డ్ అసిస్టెంట్ను అడిగి తెలుసుకున్నారు. పని ప్రదేశంలో మంచినీరు, మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కొలతల ప్రకారం పనులు పూర్తి చేసి ఉపాధిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.