వాణిజ్య ఒప్పందంపై రైతుల ఆందోళన
GDWL: అమెరికా–భారత్ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం వల్ల పత్తి రైతులకు నష్టం జరుగుతోందని సంయుక్త కిసాన్ మోర్చా నేతలు జి. గోపాల్, కార్తిక్ అన్నారు. ఈ ఒప్పందంతో పత్తి ధర మద్దతు ధర కంటే తగ్గిందని, పాలు, మొక్కజొన్న రైతులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ఏప్రిల్ 13న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్లు ప్రకటించారు.