విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయ వివరాలు..!
కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఆదివారం భక్తులు చేసిన వివిధ సేవల ద్వారా రూ.2.26,766 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 440 మంది స్వామివారిని దర్శించుకున్నారని, 21 మంది దంపతులు లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్నారని, 2,268 మంది అన్న ప్రసాదం స్వీకరించారని అన్నారు.