ప్రజల వద్దనుంచి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, వాటిని సంబంధిత శాఖలకు వెంటనే పంపించి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.