రోడ్డు భద్రత ప్రతిజ్ఞ.. జీబ్రా క్రాసింగ్ ఏర్పాటు
JN: పాలకుర్తిలో మంగళవారం రవాణా, పోలీసు శాఖల ఆధ్వర్యంలో రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వాహనదారులతో రోడ్డు భద్రత నియమాలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఏసీపీ నరసయ్య మాట్లాడుతూ.. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని కోరారు. అనంతరం రహదారులపై జీబ్రా క్రాసింగ్ పెయింటింగ్ వేయించారు.