ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం: ఎమ్మెల్యే

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం: ఎమ్మెల్యే

KRNL: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రతి అధికారి, నాయకులు కృషి చేయాలని ఆదోని MLA పార్థసారధి స్పష్టం చేశారు. శుక్రవారం తన కార్యాలయంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలతో వినతులను స్వీకరించారు. ప్రజల సమస్యలను తీర్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించారు.