VIDEO: ఏబీ వెంకటేశ్వరరావుకు బహిరంగ సవాల్
Vsp: అమరావతి రాజధానిపై తనపై వస్తున్న ఆరోపణలు నిరాధారమని, పర్యావరణరక్షణ కోసమే తాను పోరాడుతున్నానని సామాజిక కార్యకర్త, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ స్పష్టం చేశారు. ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. వైసీపీ హయాంలో అరాచకాలపై తానే పోరాడానని గుర్తుచేస్తూ, తనను జగన్ మనిషిగా చిత్రీకరించడం సంస్కారం కాదని మండిపడ్డారు.