నడిగూడెంలో పరీక్షకు ఇద్దరు ఇంటర్ విద్యార్థులు డుమ్మా
SRPT: నడిగూడెం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షకు ఇద్దరు విద్యార్థులు హాజరుకాలేదు. పరీక్షల నిర్వహణను చీఫ్ సూపరింటెండెంట్ విజయ నాయక్ పర్యవేక్షించారు. ఎస్సై అజయ్ కుమార్ ఆధ్వర్యంలో పరీక్షా కేంద్రం వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి.