సంక్రాంతి వేళ సైబర్ మోసాలతో జాగ్రత్త: శిఖాగోయల్

HYD: సంక్రాంతి పండుగవేళ సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ శిఖాగోయల్ సూచించారు. సైబర్ నేరగాళ్లు ఫేక్ షాపింగ్ ఆఫర్లు, పండుగ డిస్కౌంట్లు, నకిలీ వెబ్సైట్ల ద్వారా భారీ తగ్గింపు ధరలు చూపించి మోసం చేస్తారన్నారు. గిఫ్ట్ కార్డు మోసాలు, ఫేక్ ఈ-వ్యాలెట్లు, చెల్లింపుల కోసం నకిలీ యాప్లు, క్యూఆర్ కోడ్లు ఉపయోగిస్తారని పేర్కొన్నారు.