ఉత్తమ ప్రతిభ కనబరిచిన గురుకుల విద్యార్థులు
BDK: మణుగూరు గురుకుల పాఠశాల విద్యార్థులు ఖమ్మం జిల్లా ఎన్ఎస్ కెనాల్ స్కూల్లో నిన్న నిర్వహించిన యోగాసనం పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఈనెల 15న కరీంనగర్ జిల్లాలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలలో మణుగూరు గురుకుల పాఠశాల విద్యార్థులు ఎంపిక అవడంపై ప్రిన్సిపల్ రజిని, ఉపాధ్యాయ బృందం విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు.