పిచ్చిమొక్కలను తొలగించిన పోలీసులు
E.G: మండపేట(మం) కేశవరం నుంచి అనపర్తి వరకు కెనాల్ రోడ్డు తుప్పలు, పిచ్చి మొక్కలతో నిండిపోయి ఉంది. ఇవి కొన్ని ప్రధాన మలుపులు వద్ద ఉండటంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనబడక వాహనదారులు నిత్యం ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో సమస్యను గుర్తించిన రూరల్ CI దొరరాజు R&B అధికారులతో కలిసి తుప్పలు, పిచ్చి మొక్కలను మంగళవారం తొలగించారు.