ఏపీకి 4.. తెలంగాణాకు 10.26 టీఎంసీలు

ఏపీకి 4.. తెలంగాణాకు 10.26 టీఎంసీలు

వేసవి నీటి అవసరాల దృష్ట్యా శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నుంచి ఏపీకి 4 టీఎంసీలు, తెలంగాణాకు 10.26 టీఎంసీలను అధికారులు విడుదల చేయన్నారు. అలాగే ఇతర అవసరాల కోసం సాగర్ కుడి కాలువ నుంచి ఏపీకి రోజుకు 5,500 క్యూసెక్యుల నీటిని విడుదల చేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీశైలంలో జులై నెలాఖరు వరకు 800 అడుగుల కనీస నీటిమట్టం కొనసాగించాలని ఆదేశించింది.