VIDEO: డీ-అడిక్షన్ కేంద్రాన్ని సందర్శించిన సీపీ
HYD: సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలోని డీ-అడిక్షన్ కేంద్రాన్ని ఇవాళ సీపీ సజ్జనార్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 239 మంది రౌడీ షీటర్లకు డ్రగ్ టెస్టులు నిర్వహించగా, 188 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందన్నారు. డ్రగ్ టెస్టుల్లో పాజిటివ్ వచ్చిన వారితో మాట్లాడారు. నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే రౌడీ షీటర్ల కదలికలపై నిఘా ఉంచినట్లు పేర్కొన్నారు.