రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

KRNL: ఆలూరు మండలం హులేబీడు గ్రామంలో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ వాహనం ఢీకొట్టడంతో తుంబలబీడు గ్రామానికి చెందిన దేవేంద్రప్ప (36) అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. తల్లి గోవిందమ్మను బస్సులో ఎక్కించిన తర్వాత రోడ్డు పక్కన తుంబలబీడుకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.