‘ఎన్డీయే పాలనలో ప్రజల ఆకాంక్షలు నెరవేరవు’
ఎన్డీయే పాలనలో ప్రజలు కోరుకున్నది ఏదీ జరగదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. బీజేపీ తీసుకొచ్చిన కొత్త విధానాలు దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయని మండిపడ్డారు. ఒక పెన్నును రెండు ముక్కలుగా విడదీసి వేర్వేరు చోట్ల పడేసినట్లుగా.. బీజేపీ వ్యవస్థలను నాశనం చేస్తోందని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఏ ఒక్కటీ సక్రమంగా జరగడం లేదని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.