VIDEO: డిపో ముందు బాధితుల ధర్నా

VIDEO: డిపో ముందు బాధితుల ధర్నా

RR: గత నెల 27వ తేదీన వనస్థలిపురం పీఎస్ పరిధిలోని పిస్తా హౌస్ ముందు సాయికృష్ణ అనే యువకుడి కుడి చేయి పైనుంచి ఆర్టీసీ బస్సు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం బాధితులు హయత్ నగర్ బస్సు డిపో ముందు భైఠాయించి ధర్నా నిర్వహించారు. డీఎం డౌన్ డౌన్ అంటూ, డ్రైవర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు. సాయికృష్ణకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.