హోటళ్లపై రెవెన్యూ అధికారుల తనిఖీలు
KDP: జాయింట్ కలెక్టర్, జిల్లా సప్లై ఆఫీసర్, బద్వేల్ ఆర్డీఓ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు బద్వేల్, గోపవరం మండలాల్లోని పలు హోటళ్లలో తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తున్న 21 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో సి.ఎస్.డి.టి శివశంకర్, ఎస్ఐ గీత ప్రసాద్ రెడ్డి, వీఆర్ఓ అయ్యావారయ్య, వీఆర్ఏ నాగభూషణం పాల్గొన్నారు.