విద్యార్థినులకు డిజిటల్ భద్రతపై అవగాహన

విద్యార్థినులకు డిజిటల్ భద్రతపై అవగాహన

W.G: అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా పాలకొల్లు డీఎన్ఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఐసీడీఎస్ సీడీపీవో ఉమా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఐలు రజని కుమార్, శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఆధునిక యుగంలో విద్యార్థినులు సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ సేఫ్టీ పట్ల మెలకువగా ఉండాలని హెచ్చరించారు.