నేడు కరీంనగర్కు గవర్నర్ రాక
KNR: శాతవాహన యూనివర్శిటీలో ఇవాళ స్నాతకోత్సవం ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. విశ్వవిద్యాలయం వివిధ విభాగాల విద్యార్థులకు డిగ్రీలు, మెడల్స్ ప్రదానం చేయనున్నారు. డిగ్రీ పట్టా అందుకోబోతున్న నేపథ్యంలో విద్యార్థుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.