VIDEO: సనాతన ధర్మంపై బొలిశెట్టి వ్యాఖ్యలు
VSP: ‘వసుధైక కుటుంబకం’ మన దేశ సంస్కృతికి మూలం అని పర్యావరణ వేత్త బొలిశెట్టి సత్యనారాయణ పేర్కొన్నారు. జగద్గురు ఆదిశంకరాచార్యుల వంటి మహనీయులను కించపరచడం సనాతన ధర్మాన్ని బలహీనపరచడమేనని అన్నారు. శాక్త, శైవ, వైష్ణవ, స్మార్త సంప్రదాయాలు ఏకత్వానికి ప్రతీకలని, మత పెద్దలు సమాజాన్ని కలిపే వంతెనలుగా ఉండాలని సూచించారు.