ముదినేపల్లి ఎంపీడీవోగా రామకృష్ణ

కృష్ణ: ముదినేపల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా రామకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న మల్లేశ్వరి నందివాడ మండలానికి బదిలీ అయ్యారు. రామకృష్ణ పామర్రు మండలం నుంచి ఇక్కడికి వచ్చారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయనను కార్యాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయం సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.