లక్కీ డ్రా ద్వారా రూ.500కే రూ.16 లక్షల ఇల్లు సొంతం

లక్కీ డ్రా ద్వారా రూ.500కే రూ.16 లక్షల ఇల్లు సొంతం

BHNG: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో కంచర్ల రామబ్రహ్మం అనే వ్యక్తి రూ.16 లక్షల విలువైన ఇంటిని లక్కీ డ్రా ద్వారా విక్రయించారు. సుమారు 3,600 కూపన్‌లను రూ.500 చొప్పున అమ్మడం జరిగింది. కాగా ఇవాళ జరిగిన డ్రాలో సంగారెడ్డికి చెందిన 10 నెలల చిన్నారి హన్సిక విజేతగా నిలిచింది. ఈ పద్ధతి ద్వారా అంచనాకు మించిన రూ.3 లక్షల లాభం వచ్చినట్లు యజమాని పేర్కొన్నారు.