ఉమ్మడి తూ.గో జిల్లాకు ఎల్లో అలర్ట్

E.G: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల రానున్న 24 గంటల్లో ఉమ్మడి తూ.గో జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్పా ఎవరూ బయటకు రావొద్దనిహెచ్చరించింది. అలాగే, లంక గ్రామాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.