మల్లన్నను దర్శించుకున్న పట్నా హైకోర్ట్ న్యాయమూర్తి

మల్లన్నను దర్శించుకున్న పట్నా హైకోర్ట్ న్యాయమూర్తి

SDPT: ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామివారిని పట్నా హైకోర్ట్ న్యాయమూర్తి అనుపమ చక్రవర్తి బుధవారం దర్శించుకున్నారు. ఆమె స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు వారికి ఘనస్వాగతం పలికి వేద ఆశీర్వచనం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు మహదేవుని మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు.