భక్తుల కష్టాలు తీర్చిన బోరిగామ సర్పంచ్
ADB: ఇచ్చోడ మండలం బోరిగామ పోచమ్మ తల్లి ఆలయానికి వెళ్లే భక్తులు రోడ్డు గుంతలమయంగా మారడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాల కారణంగా ఆలయ మార్గం గుంతలమయంగా మారి భక్తులు నానా అవస్థలు పడుతున్న విషయాన్ని గుర్తించిన సర్పంచ్ ఆసిఫ్ ఖాన్ వెంటనే స్పందించారు. తన చొరవతో రహదారిపై మొరం వేయించి, మరమ్మతులు చేయించారు. దీంతో అమ్మవారి దర్శనానికి మార్గం సుగమమైంది.