'కుష్టు వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించాలి'

'కుష్టు వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించాలి'

SRPT: కుష్టు వ్యాధిపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని వైద్యాధికారి డాక్టర్ లింగమూర్తి అన్నారు. మంగళవారం తుంగతుర్తి మండలం వెంపటిలో ఈ నెల 18 నుంచి 31 వరకు నిర్వహించే కుష్ఠు వ్యాధి నిర్ధారణ కార్యక్రమంపై వైద్య సిబ్బందికి అవగాహన కల్పించి మాట్లాడారు. ప్రతి ఇంటింటికీ ఆశ కార్యకర్తలు వెళ్ళి స్పర్శ లేని రాగి రంగు మచ్చలను గుర్తించి ప్రజలకు చికిత్స అందించాలన్నారు.