ఈవిఎం గోదాముల పరిశీలించిన కలెక్టర్

PPM: పార్వతీపురం వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద గల ఈవీఎం గోదామును జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ శనివారం తనిఖీ చేశారు. నెలవారీ తనిఖీలో భాగంగా గోదాములను సందర్శించి అక్కడ పరిస్థితిని గమనించారు. గోదాములకు వేసిన సీళ్లను ఈవీఎంల రక్షణ, భధ్రతకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. రికార్డులలో సంతకం చేసి పోలీస్ గార్డులు అప్రమత్తంగా ఉండాలన్నారు.