పశ్చిమాసియాకు 2,000 మంది పారాట్రూపర్లు
యుద్ధం నేపథ్యంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. 82వ ఎయిర్బార్న్ డివిజన్ నుంచి 2,000 మంది పారాట్రూపర్లను ఇరాన్కు పంపాలని యూఎస్ ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం. ఈ దళాలను ప్రపంచంలో 18 గంటల్లో ఎక్కడైనా అమెరికా మోహరించగలదు. హర్మూజ్పై పట్టు సాధించడం, ఖర్గ్ ద్వీపంను స్వాధీనం చేసుకునేందుకు ఈ దళాలను ఉపయోగించవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.