నిర్మలా సీతారామన్కు అమరావతి జేఏసీ విజ్ఞప్తి
AP: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్కు అమరావతి రాజధాని జేఏసీ సభ్యులు వినతి పత్రాన్ని అందించారు. మరో మూడేళ్లు క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపు ఇవ్వాలని కోరారు. 44,900 ఎకరాలను ప్రభుత్వానికి రైతులు త్యాగం చేశారని.. రాజకీయ కారణాల వల్ల ప్లాట్ల అప్పగింత ఆలస్యమైందని చెప్పారు. రైతుల క్యాపిటల్ గెయిన్స్ అభ్యర్థనను పరిగణించాలని విజ్ఞప్తి చేశారు.