రికార్డు స్థాయిలో విండ్ ఎనర్జీ!
దేశంలో పవనవిద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం వేగంగా విస్తరిస్తోంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 6.05 గిగావాట్ల విండ్ ఎనర్జీ సామర్థ్యం ఏర్పాటైనట్టు కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఒక ఏడాదిలో ఏర్పాటైన అత్యధిక సామర్థ్యం ఇదేనని పేర్కొంది. దీంతో 2026 మార్చి నాటికి దేశవ్యాప్తంగా మొత్తం పవన విద్యుదుత్పత్తి సామర్థ్యం 56 గిగావాట్లకు చేరుకుంది.